Monday, April 29, 2024

మార్పు కోరుకుంటున్న జనం : మధుయాష్కి

ఎల్బీనగర్, నవంబర్ 3 (ప్రభ న్యూస్): ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుందని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం విక్టోరియా మెమోరియల్ హోం గ్రౌండ్ లో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి హాజరై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ వాకర్స్ తో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాది పీపుల్స్ మానిఫెస్టో, మీ సమస్యలే మా మానిఫెస్టో.. గెలిచాక మీ సమస్య చెప్పండి అది అప్పటికప్పుడే పరిష్కరిస్తానని అన్నారు. మాయ మాటలు చెప్పడం నాకు రాదు. చేయగలిగేది మాత్రమే చెప్తాను, చెప్పింది మాత్రమే చేస్తాను అని అన్నారు. గుండా రాజ్ నడుస్తుంది ఎల్బీనగర్ నియోజకవర్గంలో… దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

గల్లీ లీడర్ అన్న సుధీర్ రెడ్డి గచ్చిబౌలిలో ఉంటున్నాడు. ఢిల్లీ లీడర్ అన్న నేను బంజారాహిల్స్ నుంచి హయత్నగర్ వచ్చి ఉంటున్నాను. అది కమిట్ మెంట్ నీకు తేడా అంటూ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ లీడర్ అంటున్నావు కదా, రాష్ట్రం నుండి కేంద్రం దాకా నాకున్న పరిచయాలతో ప్రభుత్వ నిధులే కాకుండా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా నియోజకవర్గానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి రానన్ని నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గానికి తీసుకువస్తానని,
ఎల్బీనగర్ ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వజీర్ ప్రకాష్ గౌడ్, డివిజన్ ప్రెసిడెంట్ బద్ధుల వేణుగోపాల్ యాదవ్, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement