Wednesday, May 1, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి గాయాలు

జీడిమెట్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో చెట్టును ఢీకొన్న ఘ‌ట‌న‌లో యువ‌కుడు మృతి చెంద‌గా.. ఆటోలో ఉన్న మ‌రొక‌రికి గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెలితే.. వేణు(24) శాపూర్ నగర్ నుండి చింతల్ వైపు ఆటోలో వెళుతుండ‌గా ఆటో అదుపు తప్పడంతో రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆటోలో ఉన్న మరో వ్య‌క్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయ‌ప‌డిన వ్య‌క్తిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను తెలుసుకున్నారు. ఈ మేర‌కు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement