Saturday, April 27, 2024

మే 8వ తేది వ‌ర‌కూ రాత్రి క‌ర్ఫ్యూ పొడిగింపు….

హైద‌రాబాద్ – క‌రోనా సెకండ్ వేవ్ విల‌య తాండ‌వం చేస్తున్న స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం రాత్రి క‌ర్ప్యూని మే 8వ తేది వ‌ర‌కూ పొడిగించింది.. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.. తొలి విడ‌త ప్ర‌క‌టించిన క‌ర్ప్యూ రేప‌టితో ముగియ‌నున్న త‌రుణంలో దీనిని మ‌రో వారం రోజుల పాటు కొన‌సాగించ‌నున్న‌ట్లు ఈ ఆదేశాల‌లో పేర్కొ న్నారు.. రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ ఈ క‌ర్ఫ్యూ తెలంగాణ అంత‌టా అమలులో ఉంటుంది.. అత్య‌వ‌స‌ర సేవ‌లు, అత్య‌వ‌స‌ర ర‌వాణ వ్య‌వ‌స్థ‌ల‌ను ఈ క‌ర్ప్యూ నుంచి మిన‌హాయింపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement