Wednesday, May 8, 2024

అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొన్ని పాల వ్యాను.. ఇద్దరు మృతి

హైదరాబాద్‌: నగర శివార్లలోని వనస్థలిపురంలో పాల వ్యాను బీభత్సం సృష్టించింది. సుష్మా థియేటర్‌ సిగ్నల్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన పాల వ్యాను అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement