Friday, May 17, 2024

రెండు టాటా ఏసీ ట్రాలీలు ఢీ – ఒక‌రు మృతి-మ‌రొక‌రికి తీవ్ర గాయాలు

జనగామ జిల్లా : దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రధాన రహదారి జనగామ-సూర్యాపేట ప్రధాన రహదారిలో దుర్గమ్మ గుడి సమీపంలో యాక్సిడెంట్ అయింది. జనగామ నుంచి వస్తున్న ఐరన్ రాడ్ల లోడుతో వస్తున్న టాటా ఏసీ ట్రాలీ,సూర్యాపేట నుండి వస్తున్న టాటా ఏసీ ట్రాలీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ఘోర ప్రమాదంలో ఐరన్ రాడ్ల లోడుతో ఉన్న ట్రాలీ డ్రైవర్ కి తీవ్ర గాయాలు కాగా..ఖాళీగా వెళ్తున్న ట్రాలీ డ్రైవర్ అక్కడికిక్కడే మృతిచెందాడు..ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో జనగామ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి త‌ర‌లించారు.. మరణించిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం ప్రయివేటు వాహనంలో జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవ్యక్తి జనగామ జిల్లాకేంద్రానికి చెందిన శనిగారపు చంద్రమౌళి(45)గా గుర్తించారు.. మరణించిన వ్యక్తి దుబ్బాకకు చెందిన చింతల గంగాధర్ గా అని స‌మాచారం.పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement