Thursday, May 2, 2024

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి.. కలెక్టర్ సంగీత

పట్టణ ప్రగతి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
అధికారులను ఆదేశించారు. ఈరోజు పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లా కలెక్టర్ సుల్తానాబాద్ పట్టణం మార్కరండేయ కాలనీలో నిర్మిస్తున్న హిందూ స్మశాన వాటిక, వెజ్-నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. అలాగే 11వ వార్డు శాస్త్రినగర్ లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ భాస్కర చారి, కౌన్సిలర్లు చింతల సునీత రాజు, రెవెల్లి తిరుపతి, ఏఈ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement