Saturday, April 27, 2024

HYD: అత్యాధునిక సోలార్ ప్యానెల్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించిన లుమినస్ పవర్ టెక్నాలజీస్

హైదరాబాద్: సస్టైనబిలిటీ అండ్ సౌరశక్తి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో భారీ ముందడుగు వేస్తూ భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ లుమినస్ పవర్ టెక్నాలజీస్ ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పరిశ్రమలోనే మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. సానుకూల మార్పు కోసం ఉత్ప్రేరకం కావడానికి తోడ్పడుతూ ప్రతిష్టాత్మక పిఎం సూర్యోదయ యోజన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి వివరించిన విధంగా దేశం సోలార్ విజన్, సుస్థిరత లక్ష్యాలతో ఈ ప్రయత్నం సమలేఖనం చేయబడింది.

ఈసందర్భంగా లుమినస్ పవర్ టెక్నాలజీస్ ఎండి అండ్ సీఈఓ ప్రీతి బజాజ్ మాట్లాడుతూ… రుద్రపూర్‌లోని గ్రీన్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ భారతదేశం నెట్-జీరో మార్గంలో పెద్ద పాత్ర పోషించే దిశగా లుమినస్ వేసిన ఒక ముందడుగన్నారు. ఈ కొత్త ఉత్పాదక సదుపాయంలో తమ పెట్టుబడి సస్టైనబుల్ పద్ధతులను ప్రోత్సహించడంలో, కార్బన్ పాదముద్రను తగ్గించడంలో తమ అచంచలమైన అంకితభావాన్ని నొక్కి చెబుతుందన్నారు. సోలార్ తమ వ్యాపారంలో ముఖ్యమైన భాగంగా ఉంటుందన్నారు.

ష్నైడర్ ఎలక్ట్రిక్, ఎగ్జిక్యూటివ్ విపి – ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అండ్ లుమినస్ బోర్డ్ చైర్మన్ మనీష్ పంత్ మాట్లాడుతూ… ఇటీవలి సంవత్సరాలలో సౌర విద్యుత్ సామర్థ్యం అభివృద్ధిలో భారతదేశం అద్భుతమైన పురోగతిని సాధించిందన్నారు. ముఖ్యంగా కోటి కుటుంబాలకు సోలార్ రూఫ్-టాప్ అందించాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకం పరిచయంతో భారత ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement