Saturday, May 4, 2024

12న అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో

హైదరాబాద్, మార్చి 9 (ప్ర‌భ న్యూస్) : భారతదేశంలోనే అతిపెద్ద స్టడీ అబ్రాడ్ ఫండింగ్ ఎక్స్‌పో ఈనెల‌ 12న హైదరాబాద్‌ బేగంపేటలోని పాత విమానాశ్రయం రోడ్డుకు సమీపంలో ఉన్న మనోహర్ హోటల్‌లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఈ ఈవెంట్‌ని వీ మేక్ స్కాల‌ర్స్ భారతదేశపు అతిపెద్ద ఎడ్యుకేషన్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ నిర్వహించనుంది. వీ మేక్ స్కాల‌ర్స్ 7సంవత్సరాల క్రితం ఫేస్ బుక్ గ్రూప్ రూపంలో విదేశాల్లో చదువుకోవడానికి ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో అర్జున్ ఆర్. కృష్ణ అండ్ దామిని మహాజన్ (యూకే ప్రభుత్వ స్కాలర్‌షిప్ విజేతలు)చే ప్రారంభించబడింది.

ఇది ఉన్నత విద్య ఫైనాన్స్ పరిశ్రమలో అగ్ర స్థాయిలో ఉంది. వీరు 26,000కు పైగా అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌లకు యాక్సెస్‌ను అందించే స్కాలర్‌షిప్ పోర్టల్‌ను నిర్మించారు. భారతదేశంలో అతి తక్కువ వడ్డీ రేట్లతో విద్యార్థులకు విద్యా రుణాలను పొందడంలో సహాయపడుతున్నారు. వీరి సేవలు పూర్తిగా ఉచితం. సేఫ్ 2023లో విద్యార్థులకు అంతర్జాతీయ స్కాలర్‌షిప్‌ల గురించి తెలుసుకోవడానికి, భారతదేశంలోని అతి తక్కువ వడ్డీ రేట్లతో 14కు బ్యాంకుల నుండి తక్షణ విద్యా రుణం ప్రీ-శాంక్షన్ ను పొందే అవకాశం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement