Tuesday, April 30, 2024

టీఆర్ఎస్ కే కాదు… ఆ అవ‌కాశం అంద‌రికీ ఇవ్వాల‌న్న కోదండ‌రామ్


టీఆర్ఎస్ పార్టీ ధ‌ర్నాకు అనుమ‌తి ఇచ్చిన పోలీసులు.. అన్ని పార్టీల వారికి కూడా ఇవ్వాల‌ని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆయ‌న‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చేస్తే పోలీసులు అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తాము ధ‌ర్నా చేస్తామ‌ని అడిగితే మాత్రం పోలీసులు ఏవేవో కారణాలు చెప్పి ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కి ధర్నా చేసే అవకాశం ఇచ్చినందకు సంతోషమే.. కానీ ఆ అవకాశాన్ని ఒక్క టీఆర్‌ఎస్‌కే కాదు త‌మకు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రైతులతో చెలగాటమాడుతున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల ధాన్యం ఎందుకు కొనరని.. దీనిపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలన్నారు. ధర్నా చేసే హక్కు అందరికీ ఉందని.. కాబ‌ట్టి స‌మ‌స్య‌ల‌పై ధ‌ర్నాలు చేసేందుకు పోలీసులు అంద‌రికీ అనుమ‌తి ఇవ్వాల‌ని కోదండ‌రామ్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement