Wednesday, May 1, 2024

రూ.800కోట్లకు పైగా వితరణకు ప్రణాళిక చేసిన కినారా క్యాపిటల్

హైదరాబాద్, జూన్ 6 (ప్రభ న్యూస్) : అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్‌టెక్, ఎంఎస్ఎంఈ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కు తోడ్పడుతున్న కినారా క్యాపిటల్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్‌లలోని వేలాది ఎంఎస్ఎంఈ లకు మద్దతు ఇచ్చే ప్రణాళికలతో తన పరిధిని మరింతగా పెంచుతున్నట్లు ప్రకటించింది. తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంఎస్ఎంఈ వృద్ధికి తమ నిబద్ధతను మరింతగా పెంచుతూ ఎఫ్ వై 24లో రూ. 800కోట్లకు పైగా వితరణ చేయాలని కినారా క్యాపిటల్ ప్రణాళిక చేసింది.

ఈసందర్భంగా కినారా క్యాపిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తిరునావుక్కరసు ఆర్. మాట్లాడుతూ… తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల శ్రేయస్సు కోసం తమ అచంచలమైన నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నందుకు తాను గర్విస్తున్నానన్నారు. తాము ఇక్కడ చూస్తున్న వ్యవస్థాపక నిబద్ధతతో, ఈ ఆర్థిక సంవత్సరంలో తమ వృద్ధిలో 20శాతం ఈ ప్రాంతంలోని ఎంఎస్ఎంఈల నుండి వస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. తాము తమ కస్టమర్‌ల వృద్ధిని పెంచడానికి తగిన ఆర్థిక పరిష్కారాలు, వ్యక్తిగతీకరించిన కస్టమర్ సేవను అందించడం ద్వారా వారి విజయానికి కట్టుబడి వున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement