Sunday, April 28, 2024

HYD: కర్మన్ ఘాట్ ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం

కర్మన్ ఘాట్, ఆగస్టు 21(ప్రభ న్యూస్) : కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దేవాలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్ కుమార్, రంగారెడ్డి జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.శేఖర్ పాలకమండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇవాళ దేవాలయ ప్రాంగణంలో నూతన కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస శర్మ పాలకమండలి సభ్యులను శాలువాలు పూలమాలలతో సన్మానం చేసి అర్చకులచే ఆశీర్వాదం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సతీమణి దేవి రెడ్డి కమలా సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

పాలకమండలి సభ్యులు చంపాపేట్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి, మేక సురేందర్ రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, చాతిరి మధుసూదన్ సాగర్, గూడూరు మధుసూదన్ రెడ్డి, చీర తిరుమలేష్, చేగోని సురేష్ గౌడ్, గోగిరెడ్డి అంజిరెడ్డి, బిల్ల కంటి కిరణ్ కుమార్ గుప్తా, బీస్కుంట్ల సతీష్ గౌడ్, మేకల యాదగిరి, ముద్ద కళ్యాణ్ చక్రవర్తి, బబ్బూరి ఆనంద్ కుమార్ గౌడ్ సంబరాజు శైలజ లను ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్ ,రంగారెడ్డి జిల్లా వైశ్య సంఘం అధ్యక్షులు తాడేపల్లి వెంకటేష్ గుప్తా, షాద్నగర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సారపు రమేష్ ,ఊరే లక్ష్మణ్ గుప్తా, చంపాపేట ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బచ్చు మహేష్ గుప్తా, రవి అనంత, ఆకుల రమాకాంత్, ఊరే రవీందర్, నారాయణ ,గోవిందు శీను, ఇడు కుల విజయనాథ్, కొండూరు శ్రీకాంత్, నాగ బండి నగేష్, పసునూరి శ్రీనివాస్, సంగమేశ్వర్ బాలాపూర్ మండల మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తాతో పాటు డివిజన్ బారాస అధ్యక్షులు ముడుపు రాజ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కుమ్మరి సంఘం అసోసియేట్ అధ్యక్షులు మల్కాజ్గిరి దయానంద్, గౌడ సంఘం సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, బేరా బాలకిషన్, బాలా గౌడ్, శాగా రోజా రెడ్డి, రమాదేవి, సరోజ, లక్ష్మి, రాధిక, జంగయ్య, ప్రభాకర్, శేఖర్ రెడ్డి, నిష్కాంత్ రెడ్డి, వసంత రెడ్డి, గౌని అనసూయ, కిరణ్, సామ శ్రీధర్ రెడ్డి, ఉమామహేశ్వర్, గౌరీ దేవి రాజు, గూడూరు గౌతమ్ రెడ్డి, సిబ్బంది వెంకటయ్య, శ్రీనివాస్ పాల్గొనగా అర్చకులు అంబా ప్రసాద్, శంకర్ శర్మ, సంతోష్ కుమార్, ప్రవీణ్ కుమార్ శర్మ, చంద్రమ శుక్ల, అనంతరామ శర్మ, శ్రవణ్ కుమార్ శర్మ, తదితరులు ఆశీర్వాదం అందజేశారు.

దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం.. నల్ల రఘుమారెడ్డి..

- Advertisement -

కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం అభివృద్ధికి కృషి చేయనున్నట్లు దేవాలయానికి ధర్మకర్తగా ఎంపికైన నల్ల రఘుమారెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ధర్మకర్తలతో కలిసి మాట్లాడుతూ… దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నింటిని కమిటీ సభ్యులతో పాటు ఆలయ అభివృద్ధి కోసం అందిస్తున్న దాతలు, భక్తుల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధితో పాటు దేవాలయంలో జరిగే కార్యక్రమాలన్నింటిని కనుల పండుగగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సహకారంతో దేవాలయాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులందరూ మాట్లాడుతూ… దేవాలయ అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement