Sunday, May 12, 2024

జూబ్లీహిల్స్ పబ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు

హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప‌రిధిలోని అమ్నేషియా ప‌బ్ ప‌రిస‌రాల్లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్‌ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసున‌కు సంబంధించి నిందితుల గుర్తింపు ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వీరిలో మేజ‌ర్ అయిన సాదుద్దీన్ చంచ‌ల్‌గూడ జైల్లో ఉండ‌గా.. మిగిలిన ఐదుగురు మైన‌ర్లు జువెనైల్ హోంలో ఉన్న సంగతి తెలిసిందే.

త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డ నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులు, న్యాయ‌మూర్తికి తెలిపింది. చంచల్‌గూడ జైలుతో పాటు జువెనైల్ హోంకు వెళ్లిన బాధితురాలు న్యాయ‌మూర్తి స‌మ‌క్షంలోనే నిందితుల‌ను గుర్తించింది. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు బాధితురాలు వివ‌రంగానే స‌మాధాన‌మిచ్చింది. ఈ వివ‌రాల‌న్నింటినీ పోలీసులు న‌మోదు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement