Wednesday, May 1, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం…

ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. నగరంలోని కుల్సుంపుర భరత్ నగర్ బస్తీలో ఇంటర్ విద్యార్థిని నవ్య ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు క్షుద్రపూజలే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. క్షుద్రపూజల కారణంగా తమ కూతురు బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

జూన్ 1 గురువారం ఆమావాస్య రోజు నవ్య  ఇంటిముందు నిమ్మకాయలు, నల్ల బొమ్మలు కనిపించాయి. ఆ రోజు వాటిని చూసిన నవ్య తీవ్ర భయాందోళనలకు గురయ్యింది.   కళ్ళు మూసినా తెరిచిన అవే కనబడుతున్నాయని నవ్య  తమతో చెప్పేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిజానికి నవ్య చాలా ధైర్యవంతురాలు, చాలా యాక్టివ్ అని  అంటున్నారు. అయితే  ఇంటిముందు నిమ్మకాయలు, నల్లబొమ్మలు కనిపించడంతో భయపడిందని వెల్లడిస్తున్నారు. బుధవారం మళ్లీ నవ్య వాకిట్లో నిమ్మకాయలు, కుంకుమ కనిపించాయి. వాటిని చూసిన నవ్య మరోసారి భయాందోళనకు గురైంది. నవ్యనే వాటిని ఇంటిముందు నుంచి ఊడ్చేసి, కాల్చేసింది.  ఆ తర్వాత స్నానం చేసిన నవ్య కొద్దిసేపు కుటుంబ సభ్యులతో గడిపింది. నవ్య అక్క వంట చేస్తుండగా గుడ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఈ సమయంలో 5 నిమిషాల్లో వస్తా వంట గదిలో నుంచి మరో గదిలోకి వెళ్లిన నవ్య..అక్కడ ఉరివేసుకుని  ఆత్మహత్య చేసుకుంది.  

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement