Sunday, April 28, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టి ఇందు కుసుమ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటి ఇందు కుసుమ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇందు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం డైరెక్టర్స్ తేజ, రాకేష్ ఉప్పలపాటి, రాజా కొలుసు, రమేష్ కి ఇందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement