Sunday, May 5, 2024

ఆర్యవైశ్యులకు అండగా… సీఎం సహాయ నిధి – ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ఆర్యవైశ్యులకు అండగా…ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి అని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మండల కేంద్రానికి చెందిన కిరాణం దుకాణం నిర్వహించే సింగంశెట్టి గోపాల్ కు ఇటీవల బ్రెయిన్ కి శస్త్ర చికిత్స జరుగగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.60 వేలను నాగోల్ లోని తన కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుందన్నారు. మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారన్నారు. వైద్య చికిత్స చేసుకోలేక ఆర్దిక ఇబ్బందులు పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఈఫండ్ ఆసరాగా నిలుస్తుందన్నారు. బాధితులు అవసరమైన సమయంలలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగపర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ కలకొండ మనిమాల, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చైతన్యపురి డివిజన్ ట్రెజరర్ దర సరిత, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ గౌడ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement