Sunday, April 28, 2024

రేపు ప్రధానితో హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్ల భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో హైదరాబాద్ నగర బీజేపీ కార్పొరేటర్లు నేడు సమావేశం కానున్నారు. సాయంత్రం గం. 4.00 సమయంలో జరిగే ఈ భేటీలో పాల్గొనడం కోసం సోమవారం పలువురు బీజేపీ కార్పొరేటర్లు ఢిల్లీ చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరికొందరు బీజేపీ కార్పొరేటర్లు, ముఖ్య నేతలు మంగళవారం డిల్లీ చేరుకోనున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగర కార్పొరేషన్ ఎన్నికలు, రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేటర్లకు మోదీ దిశానిర్దేశం చేయనున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను కూడా హైదరాబాద్‌కు చెందిన 47 మంది కార్పొరేటర్లు కలవనున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement