Friday, April 26, 2024

క్రీడారంగానికి ప్ర‌భుత్వం పెద్ద‌పీట : ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌

హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో డ‌బ్ల్యూఎండీ ఇండియ -2022 #BIKERPANDUGA వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రత, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నార‌ని, అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తున్నార‌న్నారు. గ‌త పాల‌కులు క్రీడ రంగాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవ‌ని, కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నూతన స్టేడియాలు ఏర్పాటుకు కృషి చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ జోష్, ఇంటిలిజెన్సీ డీఎస్పీ ఠాకూర్ సుకదరు సింగ్‌, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ విజేత వి.రామ్మోహన్ రెడ్డి, వీరితో దాదాపు 200 మంది బైక్ రైడర్స్, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement