Thursday, May 2, 2024

వనస్థలిపురంలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవ దహనం

హైదరాబాద్ వనస్థలిపురంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎఫ్‌సీఐ కాలనీలోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చేలరెగడంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే అక్కడి నుండి పరుగులు తీశారు. మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి

సదరు ఇంట్లో బాలకృష్ణ అనే వ్యక్తి భార్య ఇద్దరు పిల్లలతో పాటు నివాసం ఉంటున్నాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలకృష్ణ భార్య మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. బాలకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వెంటనే ఇంటి యజమాని బాలకృష్ణను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement