Saturday, April 27, 2024

డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు..

కవాడిగూడ : ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌లోని వివిధ బస్తీలలో నెలకొన్న డ్రైనేజ్ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. డివిజన్‌లోని రామాలయ వీధి బస్తీలో డ్రైనేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వాటర్‌ వర్స్క్‌ అధికారులకు సూచించారు. అధికారులతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలోని వివిధ బస్తీలలో డ్రైనేజి సమస్యను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బస్తీలలో నూతన పైప్‌లైన్‌లు వేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా డ్రైనేజీ పొంగిపోర్లుతోందని, ఈ విషయాన్ని స్థానికులు తనదృష్టికి తెచ్చినట్లు ఆయన వెల్లడించారు. బస్తీలలోని సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెస్తే వాటిని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో టిఆర్‌ఎస్‌ యువనేత ముఠా జయసింహా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement