Thursday, May 2, 2024

మినీ పుర పోరును నిలిపివేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ హైకోర్టులో లంచ్ మోష‌న్..

హైద‌రాబాద్ – తెలంగాణ‌లోని రెండు కార్పొరేష‌న్ లు, అయిదు మునిసిపాలిటీల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌ను నిలిపివేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోష‌న్ దాఖ‌లు చేసింది.. క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల కోసం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ ను వెంట‌నే నిలుపుద‌ల చేయాల‌ని కోరుతూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ హైకోర్టును ఆశ్ర‌యించారు… ఆయ‌న వేసిన లంచ్ మోష‌న్ పిటిష‌న్ ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించింది.. దీనిపై ఇరు వర్గాల వాదోప‌వాదాల‌ను నేడు హైకోర్టు విన‌నుంది….లంచ్ మోష‌న్ పిటిష‌న్ తీర్పుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement