Friday, May 17, 2024

కరోనాతో ముగ్గురు సచివాలయం ఉద్యోగులు మృతి

ఏపీ సచివాలయం లో కరోనా కలకలం సృష్టించింది. ఇప్పటికే ఇద్దరు సచివాలయం ఉద్యోగులు మృతిచెందగా.. తాజాగా ఏపీ సచివాలయానికి చెందిన మరో ఉద్యోగిని కరోనాతో మృతి చెందారు. పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న శాంత కుమారి ఇవాళ ఉదయం కరోనాతో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం శాంత కుమారి భర్త సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు. సచివాలయం ఉద్యోగులు ఇలా కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తమకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు.

సచివాలయంలో కరోనాతో ముగ్గురు ఉద్యోగులు మృతి చెందడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్ జి.రవికాంత్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రెటరీ గా పనిచేస్తున్న పద్మారావుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మృతి చెందిన ఉద్యోగుల ఆత్మకు శాంతి కలగాలని తన చాంబర్‌లో రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్బంగా ఆయన సచివాలయ ఉద్యోగులు కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని, ఎక్కడైనా అస్వస్థత, అనారోగ్య లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాల్లో తప్పనిసరిగా కాల వ్యవధిని అనుసరించి రెండు టీకాలను వేయించుకోవాలని కోరారు. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వుండాలని కోరారు. మాస్క్ తప్పని సరిగా ధరిస్తే, భౌతికదూరంను పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement