Thursday, May 2, 2024

మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన షబ్బీర్ అలీ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోడానికి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేయనుంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణకు సంబందించి రాష్ట్ర ఎన్నికల సంఘం గత గురువారం షెడ్యూల్ విడుదల చేసింది.

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌ల పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో కొత్త పాలకవర్గం కోసం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈనెల 30న ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమయాత్తం అవుతోంది. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ సీనియర్ నేత ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement