Saturday, May 4, 2024

HYD: మూడో సారి అధికారంలోకి రావడం ఖాయం.. కేటీఆర్

కర్మన్ ఘాట్, అక్టోబర్ 20 (ప్రభ న్యూస్) : రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ ఎస్ సి సెల్ జనరల్ సెక్రటరీ పాశం శ్రీశైలం, ఎల్బీనగర్ బీజేవైఎం నాయకులు రచమల్ల నిఖిల్ గౌడ్, సుల బాబు, మేడిపల్లి చందర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మెడి పల్లి నవీన్, ఏర్వ మహేందర్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చైర్మన్ రఘుమా రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఈకార్యక్రమంలో గడ్డి అన్నారం మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకోజు కృష్ణమాచారి, బారాస అధ్యక్షులు ముడుపు రాజిరెడ్డి, హనుమాన్ దేవస్థానం ధర్మకర్తలు గోగిరెడ్డి అంజిరెడ్డి, చీర తిరుమలేష్, ఎల్బీనగర్ యూత్ ప్రెసిడెంట్ రవి ముదిరాజ్, నాయకులు కొత్తపేట్ ప్రభాకర్, జంగయ్య, నిష్కాంత్ రెడ్డి, గూడూరు గౌతమ్ రెడ్డి, శివ గౌడ్, జగదీష్, గౌరీదేవి రాజు, చందు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement