Monday, May 6, 2024

గాంధీజీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పరిపాలన : స్పీకర్‌, మండలి చైర్మన్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

అసెంబ్లీ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి.. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలు దేశంలో ప్రతి ఒక్కరికీ అందాలన్నారు. అందరికీ సమానంగా పరిపాలన చేరువవ్వాలని తెలిపారు. గాంధీజీ స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పరిపాలన చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంగా అవతరించిన ఎనిమిదేండ్లలోనే దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement