Thursday, April 25, 2024

చిన‌జీయ‌ర్ స్వామికి క‌రోనా వ్యాక్సినేష‌న్..

హైద‌రాబాద్ – కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు త్రిదండి చినజీయర్ స్వామి. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి వైద్యులు స్వామికి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ వేసుకున్న అనంత‌రం చిన‌జీయ‌ర్ మాట్లాడుతూ, మనం రోజూ తినే ఆహారం మొత్తం కెమికల్స్‌తో విషతుల్యం అవుతోందని అన్నారు ఇలాంటి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వ్యాక్సిన్ తీసుకోవాలని స్వామీజీ అన్నారు. అందరూ కరోనా టీకా వేయించుకోవాలని చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. కాగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాక్సిన్ వేయించుకున్నారు చిన‌జియ‌ర్..

Advertisement

తాజా వార్తలు

Advertisement