Tuesday, May 21, 2024

Hyd: నాలుగు ఇళ్లలో.. Cheddi gang చోరీ

హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్‌ భారీగా చోరీలకు పాల్పడింది. హయత్‌నగర్ పీఎస్ పరిధిలోని కుంట్లూరు ప్రజయ్‌ గుల్మహార్‌ గేటెడ్‌ కమ్యూనిటీలోని నాలుగు ఇళ్లలో చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. విలియంసన్ అనే వ్యక్తి ఇంట్లో 7.5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు ఎత్తుకెళ్లారని తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement