Thursday, April 25, 2024

ఓఆర్ఆర్‌పై కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ శివార్లలోని శంషాబాద్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని చెప్పారు. ఆంధ్రపదేశ్‌లోని ఒంగోల్‌కు చెందిన నేలపాటి సుధీర్‌ ఉన్నారని తెలిపారు. ఆయన మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడీషియన్‌గా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement