Friday, April 19, 2024

దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. నిన్న కొత్తగా 30,773 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల మొత్తం సంఖ్య‌ 3,34,48,163కి చేరింది. అలాగే, నిన్న 38,945 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 309 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,44,838కి పెరిగింది. ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,26,71,167 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,32,158 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 85,42,732 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 80,43,72,331 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

ఇది కూడా చదవండి: నిధులపై తేల్చుకుందాం రాః సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement