Thursday, May 9, 2024

బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. ఒక‌రు మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. ఈ సంఘటన ఇవ్వాల (శుక్రావారం) హైదరాబాద్ లో చోటుచేసుకుంది. యుసుఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో అధిక వేగంతో ఉన్న సిటీ ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న ఎక్స్‌ఎల్‌ చాంప్ వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు ముందు టైరు వాహనంపైకి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ఎల్‌ వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్‌, కండక్టర్‌ బస్సు దిగి పరారయ్యారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement