Thursday, April 25, 2024

రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెరాస ప్రభుత్వం విఫలం – కార్పొరేటర్ సుజాత నాయక్

కర్మన్ ఘాట్ రైతుల సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గా విఫలం చెందిందని హస్తినాపురం కార్పొరేటర్ భానోత్ సుజాత నాయక్ అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు తెలంగాణ రైతు ఘోష బిజెపి పోరు దీక్ష లో భాగంగా సోమవారం దీక్షా కార్యక్రమాన్ని తన నివాసంలోనే చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రైతు పండించిన పంటను కల్లంల్లోనే కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతు రుణమాఫీ చేయలేదని వెంటనే రుణమాఫీ చేయాలని కోరారు రైతు ప్రభుత్వం అని చెప్పుకునే తెరాస రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టాల పాలవుతున్నారు అని అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement