Friday, April 26, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హ‌న్మంత్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ సిరి హన్మంత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సిరి హన్మంత్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. సిటీలో గ్రీనరి పెరగాల్సిన అవసరముంద‌ని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తన స్నేహితులు ప్రియ, వైష్ణవి చైతన్య, శ్రీహాన్ ముగ్గురికి సిరి హన్మంత్ గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement