Monday, April 29, 2024

HYD: సామాజిక లక్ష్యంతో చేపట్టిన బచ్‌పన్ మనావో, బడ్తే జావో అద్భుతం

హైదరాబాద్ : బచ్‌పన్ మనావో, బడ్తే జావో అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. నేటి బాలలే రేపటి పౌరులు అనే సూత్రాన్ని బలంగా నమ్మి.. ప్రతీ బిడ్డ సమగ్ర వికాసాన్ని పెంచేందుకు రూపొందించిన ఒక సామాజిక కార్యక్రమం. ఇది ప్రచారం కోసమే కాదు, దేశ నిర్మాణానికి అవసరమైన, సామాజిక లక్ష్యంతో రూపొందించబడింది. చిన్ననాటి అనుభవం (0-8 సంవత్సరాలు) భారతదేశంలోని ప్రతి బిడ్డకు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి ఇది శక్తినిస్తుంది. అంతేకాకుండా వారి భవిష్యత్తు ప్రయత్నాలలో అభివృద్ధి చెందడానికి వారిని సన్నద్ధం చేస్తుంది. ఈ సందర్భంగా ఏక్ స్టెప్ సహ వ్యవస్థాపకురాలు రోహిణి నీలేకని మాట్లాడుతూ… “బచ్‌పన్ మనావో, బద్దే జావో’ అనేది బాల్యాన్ని మరింత అందంగా అందుకోవడం ద్వారా భారతదేశ పిల్లల అభ్యాస ప్రయాణాన్ని పెంపొందించడానికి రూపొందించిన ఒక సామాజిక లక్ష్యం. బాల్యం అనేది అందరికంటే గొప్ప ఉపాధ్యాయురాలు. మన దేశపు యువ పౌరులే రేపటి భవిష్యత్తు. ప్రతి ఏడాది, భారతదేశంలో సుమారు 25 మిలియన్ల మంది పిల్లలు పుడుతున్నారు.

అదే సమయంలో తమకు ప్రతి తరం పిల్లలు నేర్చుకుంటున్నారని లేదా నిర్ధారించుకోవడానికి అవకాశం కూడా ఉంది. దేశంలోని ప్రతి బిడ్డకు స్థిరమైన పునాదిని అందించడానికి మాకు ఉత్తమ అవకాశం లభించింది. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి చిన్న పిల్లాడికి జీవితాంతం నేర్చుకునే వ్యక్తిగా మారడానికి అవసరమైన బలమైన పునాదిని అందించాలి. అది ప్రస్తుతం అసంపూర్తిగా ఉంది. ఆ పనిని ఇప్పుడు మేం పూర్తి చేయడానికి వివిధ సంస్థల నెట్‌వర్క్ తో కలిసి వచ్చాం. రండి, నేర్చుకునే ఆనందాన్ని ప్రజాస్వామ్యీకరించడానికి అందరం సహాయం చేద్దాం” అని అన్నారు ఆమె.

ఈ సందర్భంగా శంకర్ మురువాడా మాట్లాడుతూ… “ఈ మిషన్ నేటి ప్రపంచంలో బాల్యదశను మరోసారి పునఃపరిశీలించమని కోరుతుంది. ప్రతి బిడ్డ తన చుట్టూ ఉన్న సమృద్ధిని అర్థం చేసుకోవడానికి, విలువైనదిగా గుర్తించేందుకు ఇది మమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఈ మిషన్‌కు ఉత్ప్రేరకంగా ఉండటం ద్వారా మా పాత్ర మరింత విలువైనది. ఇది సగర్వంగా అందరు సహకారుల భుజాలపై మోయబడుతుంది” అని అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement