Monday, May 6, 2024

నిజాంపేట్ కార్పొరేషన్ కు కొత్త కమిషనర్ రాక.. ఎమ్మెల్యే వివేకానందతో భేటీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా విధులు నిర్వహించిన శంకరయ్య ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. దీంతో నిజాంపేట్ కు నూతన కమిషనర్ గా బి.వంశీ కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కమిషనర్ బి.వంశీ కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతీ ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో నడిపించే దిశగా పని చేయాలని ఆయ‌న సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement