Thursday, May 2, 2024

28నుండి అంబేద్కర్‌ ఓపెన్‌ డిగ్రి ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు..

షాద్‌నగర్‌(ప్రభన్యూస్‌): డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రిలో ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు చివరి 6వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 28 జూన్‌ నుండి ప్రారంభమవుతాయని షాద్‌నగర్‌ సార్వత్రిక డిగ్రి స్టడి సెంటర్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌. రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈ పరీక్షల హాల్‌ టికెట్‌లు యూనివర్సిటీ వెబ్‌ సైట్‌లో నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని 2017-18 బ్యాచ్‌ ల వారికి బ్యాక్‌ లాక్‌, 2019,రెగ్యులర్‌ వారికి ఈ పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు పరీక్షకు హాల్‌ టికెట్‌, యూనివర్సిటీ ఐడెంటిటి కార్డు తప్పని సరిగ్గా వెంట తీసుకోని గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని కోరారు. కోవిడ్‌ నిబంధనలు తప్పని సరిగ్గా పాటించాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement