Saturday, April 27, 2024

HYD: వైద్యం వికటించి వ్యక్తి మృతి… హాస్పిటల్ ముందు బంధువుల అందోళన…

మేడిపల్లి, జనవరి ప్రభన్యూస్: వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన‌ సంఘటన మేడ్చ‌ల్ జిల్లా పీర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్ లో జరిగింది. భార్య బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… కొండమడుగు గ్రామం, బీబీ నగర్ కు చెందిన మండల వెంకటేష్ గౌడ్ (45), భార్య వైష్ణవి, వీరికి ఇద్దరు పిల్లలు. వెంకటేష్ కొండమడుగులో ఓ ప్రయివేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు.

గత నెల 30న వెంకటేష్ కు ఆక్సిడెంట్ అవ్వడంతో స్టార్ ఇన్సూరెన్స్ ఉందని పీర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చారు. అడ్మిట్ చేసుకుని వైద్యులు చికిత్స నిర్వహించారు. అప్పటినుండే కోమాలో ఉండి మంగళవారం మాట్లాడడంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. అదే రోజు రాత్రి వెంకటేష్ మృతి చెందారని హాస్పిటల్ సిబ్బంది తెలపడంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఎలా మృతి చెందారని బంధువులు హాస్పిటల్ వద్ద అందోళనకు దిగారు. యాజమాన్యం, వైద్యం అందించిన వైద్యుల వివరణ ఇవ్వాలని బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించారు. స్థానిక పోలీసులు చేరుకొని యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని, తమకు న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement