Sunday, April 28, 2024

Ponnam: ప్ర‌జా పాల‌న చూసి…బీఆర్ఎస్‌కు నిద్ర‌ప‌ట్ట‌డం లేదు…మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదంటూ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ చ‌వాక్కులు పేల్చారు. హైద‌రాబాద్‌లోని భోల‌క్ పూర్‌లో ప్ర‌జాపాల‌న‌, అభ‌య‌హ‌స్తం ద‌ర‌ఖాస్తు కేంద్రాల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఆటో డ్రైవర్లతో ఎందుకు ధర్నా చేయిస్తోంది? అని మండిపడ్డారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయవద్దని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారా అంటూ అని నిలదీశారు. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ ధర్నా చేయించడం వెనుక ఆంతర్యం ఏమిటి? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తాము అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేశామని వెల్లడించారు. అలాగే అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement