Saturday, April 27, 2024

రెండో డోస్ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న డిజిపి…

హైద‌రాబాద్ : రాష్ట్ర డీజీపీ ఎం.మ‌హేంద‌ర్ రెడ్డి నేడు రెండో డోస్ కొవిడ్ వ్యాక్సినేష‌న్‌ను తీసుకున్నారు. అంబ‌ర్‌పేట అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌లో డీజీపీ కి మెడికల్ ఆఫీసర్ గీతారాణి ఆధ్వర్యంలో కోవాగ్జిన్ వాక్సినేషన్ వేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాక్సినేష‌న్‌పై డీజీపీ అక్క‌డి వైద్యాధికారుల‌ను వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన తిల‌క్‌న‌గ‌ర్ అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్‌లో డీజీపీ మొద‌టి డోస్ వ్యాక్సిన్‌ను డిజిపి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement