Sunday, May 19, 2024

తొలి రౌండ్ – 1054 ఓట్ల ఆధీక్యంలో టి ఆర్ ఎస్ అభ్య‌ర్ధి వాణీదేవి

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల తొలి రౌండ్ బ్యాలెట్స్ లెక్కింపు పూర్తి అయింది.. ఈ రౌండ్ లో టిఆర్ఎస్ అభ్య‌ర్ధి సుర‌భి వాణీదేవికి 1054 ఓట్ల అధీక్యం ల‌భించింది..ఈ రౌండ్ లో ఆమెకు 17,439 ఓట్లు రాగా, రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 16,385 ఓట్లు వచ్చాయి. ఇక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 8,357 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి జి.చిన్నారెడ్డి 5,082 ఓట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ స్థానం నుంచి మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. 3,57,354 ఓట్లు పోలయ్యాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్నది..

Advertisement

తాజా వార్తలు

Advertisement