Tuesday, April 30, 2024

Breaking: భార్యను గొడ్డలితో కొట్టి చంపిన భర్త.. మ‌హ‌బుబాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

మహబూబాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. భార్య‌పై కోపంతో ఓ ప్ర‌జాప్ర‌తినిధి గొడ్డ‌లితో కొట్టి చంపేసిన ఘ‌ట‌న ఇవ్వాల‌(మంగ‌ళ‌వారం) ఉద‌యం జ‌రిగింది. మరిపెడ మండలం తానంచెర్ల పరిధిలోని ఆనకట్ట తండా ఉపసర్పంచ్ రవి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డ‌ట్టు ప్రాథ‌మిక స‌మాచారం..

మంగళవారం తెల్లవారుజామున ర‌వి త‌న భార్య మమత (28)ని గొడ్డలితో మోది చంపేశాడు. ఈ సమాచారం అందుకున్న‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఇంత‌టి ఘోరానికి ర‌వి ఎందుకు పాల్ప‌డ్డాడ‌నే విష‌యంపై క్లారిటీ లేదు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement