Friday, May 17, 2024

Honor Meet – మంత్రి ప్ర‌శాంత్ రెడ్డితో కార్పొరేషన్ కమిషనర్ భేటి..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ధ్ మర్యాదపూర్వకంగా రోడ్డు రవాణా శాఖ మాత్యులు ప్రశాంత్ రెడ్డిని కలిశారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం అధికారుల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈ బదిలీల్లో నిజాంబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా నూతనంగా వచ్చిన మకరంద్ మంగళవారం బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మంత్రి నివాసానికి వెళ్లారు. మర్యాద పూర్వకంగా కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డికి బొకెను అందజేసి పరిచయం చేసుకున్నారు.

మంత్రి కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజాంబాద్ కార్పొరేషన్ లో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురు కాకుండా శ్రద్ధ తీసుకోవాలన్నారు. అధికారులు అంకితభావంతో పనిచేస్తే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవచ్చని మంత్రి కమిషనర్ కు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement