Tuesday, April 30, 2024

TS : ఇబ్ర‌హీంప‌ట్నంలో ప‌రువు హ‌త్య‌

తెలంగాణ‌లోని ఇబ్రహీంపట్నంలో పరువుహత్య చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో తన కూతురు కుటుంబ పరువు తీస్తుందని ఓ తల్లి తన కూతురుని చున్నీతో ఉరివేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని దండుమైలారంలో సోమ‌వారుం చోటుచేసుకుంది.

- Advertisement -

వివ‌రాల‌లోకి వెళితే… దండుమైలారంలో జంగమ్మ కుటుంబం నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. కూతురు భార్గవి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటుంది. అయితే తను చదవున్న కాలేజీలో శశి అనే అబ్బాయి పరిచయమయ్యాడు. కొద్దిరోజులు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రాను రాను వీరిద్దరు ఎక్కవగా కలవడం మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం కాస్తా భార్గవి కుంటుంబ సభ్యులకు తెలియడంతో రచ్చ రచ్చ చేశారు.

శశిని కలవకూడదని పరువు పోతుందని ఇది సరైన పద్దతి కాదని ముందు చదువు మీద శ్రద్ద పెట్టాలని భార్గవి తల్లి జంగమ్మ మందలించింది. అయినా భార్గవి కుటుంబాన్ని, తన తల్లి చెప్పిన మాటలను పక్కన పెట్టి శశిని కలవడం మానలేదు. దీంతో ప్రేమ వ్యవహారంలో గత కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భార్గవి తల్లి నిరాకరించింది. ఏమైందో ఏమో కానీ.. భార్గవి హత్యకు ముందు కలిసేందుకు ప్రియుడు శశి వచ్చాడు.

దీంతో అది చూసిన తల్లి జంగమ్మ ఆగ్రహంతో ఊగిపోయిది. శశి ఇంటికి ఎందుకు వచ్చాడు అని అడిగింది భార్గవి సమాధానం చెప్పకపోవడంతో తల్లి జంగమ్మ రెచ్చిపోయింది. ప్రేమ వ‌ద్ద‌ని ఎంత నచ్చ చెప్పినా కుమార్తె విన‌క పోగా, త‌ల్లిని కూడా ఎదిరించి మాట్లాడింది… ప్రేమ వివాహం చేసుకుంటే కుటుంబ ప‌రువు పోతుంద‌నే భ‌యంతో చివరకు కన్న కూతురినే చీరతో ఉరి వేసింది. ఆ త‌ర్వాత ఏమీ తెలియనట్లు కూతురు చనిపోయిందని ఏడుస్తూ కూర్చుంది.

అయితే ఈ మ‌ర‌ణంపై భార్గవి సోదరుడు అనుమానికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కన్నతల్లే భార్గవిని చంపిందని కేసు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. కుటుంబ ప‌రువు పోతుంద‌నే తానే కుమార్తెను అవేశంలో హ‌త్య చేశాన‌ని త‌ల్లి స్టేట్మెంట్ ఇచ్చింది.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement