Thursday, May 16, 2024

TS : తెలంగాణ‌లో 107 మందిపై అన‌ర్హ‌త వేటు ..

ఎన్నికల్లో పోటీ చేసి ఖర్చులు సమర్పించని వారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులైన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. రాష్ట్రంలో 107 మంది ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఈసీ వెల్లడించింది. అనర్హుల్లో అత్యధికంగా నిజామాబాద్ లోక్ స‌భ‌ పరిధి వారు ఉండటం గమనార్హం.

ఈ నియోజకవర్గం నుంచి గతంలో పసుపు బోర్డు కోసం 72 మంది పార్లమెంట్, 35 మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం వీరంతా అనర్హులని ఎన్నికల సంఘం ప్రకటించింది.

- Advertisement -

అలాగే మెదక్ లోక్ స‌భ‌ పరిధిలో హన్మంతరెడ్డి, మహబూబాబాద్ నుంచి కొల్లూరి వెంకటేశ్వర్రావు, నల్లగొండ నుంచి పోటీ చేసిన కే వెంకటేశ్ లు అన‌ర్హుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీలో పోటీ చేసిన వారు వచ్చే ఆగస్టు వరకు, లోక్ స‌భ‌కు పోటీ చేసినవారు వచ్చే జూన్ వరకు పోటీ చేయడానికి అనర్హులుగా ఈసీ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement