Thursday, May 2, 2024

మ‌ద్యం మ‌త్తులో కారుతో గుద్దేశాడు.. ఆ కారు వెళ్లి మ‌రో కారును ఢీకొట్టింది..

తిమ్మాపూర్, ప్రభ న్యూస్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎల్ ఎం డి కమాన్ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి అతి వేగంగా ముందు కారును ఢీ కొట్టగా ఆ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది.. ఇట్లా మూడు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఎల్ ఎం డి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహాత్మానగర్ కు చెందిన మందబాపు మరో ముగ్గురితో కలిసి మద్యం మత్తులో కరీంనగర్ నుంచి తిమ్మాపూర్ వైపు రాజీవ్ రహదారిపై కారులో వెళ్తున్నాడు. కాగా, కరీంనగర్ కు చెందిన భాస్కర్ రెడ్డి వారి కారు కొట్టింది. ఈ క్ర‌మంలో ఆ కారు అంతే వేగంతో ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఇందులో ఇద్దరికి గాయాలయ్యయి. ప్రమాద ఘటన తెలుసుకున్న ఎస్సై ప్రమోద్ రెడ్డి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement