Wednesday, May 8, 2024

VH: ప‌దేళ్లు పాలించారు.. ప‌ది రోజులు కూడా ఆగ‌లేక‌పోతున్నారేంటి సామి.. కేటీఆర్ కు వీహెచ్ చుర‌క‌లు..

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తీరు బాగాలేదని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిప‌డ్డారు. తెలంగాణ అభివృద్ది కోసం దావోస్‌ వెళ్లిన సీఎంపై కామెంట్లు చేయడం హాస్యంగా ఉందని అన్నారు. పదేళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించార‌ని, పది రోజులు కూడా ఓపిక పట్టకపోతే ఎలా ? అన్నారు. గాంధీభ‌వ‌న్ లో ఇవాళ‌ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టిన వాళ్ళను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని మండ్డిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క పని చేయలేదన్నారు.

తాము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్ సౌకర్యాలు ఇచ్చామన్నారు. ధరణి కమిటీ వేశామని, అనేక పనులు జరుగుతున్నాయని తెలిపారు. తొందరపడి మాట్లాడితే మీరు ఇంకా నష్టపోతారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడండని కేటీఆర్ కు సూచించారు. మీరు చేసే విమ‌ర్శ‌ల‌ వల్ల మీరే ఇంకా దిగజారిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకంటే ముందే మీ లొల్లి ఏంది ? అని ప్రశ్నించారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పనీ పాటలేక మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇక మాజీ సీఎం ఫౌమ్‌హౌస్‌ లో వుండిపోయారని, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదని అన్నారు. ఇక మిగిలిన వారు మాత్రం మాపై బురదజ‌ల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ లో కాంగ్రెస్ గల్లంతు అవుతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కానీ గ‌ల్లంతు అయ్యేది మీరేన‌ని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement