Saturday, May 4, 2024

హైదరాబాద్ బయలుదేరిన పద్మశ్రీ అవార్డు గ్రహీత బృందం

జైనూర్,ఆగస్టు14(ప్రభన్యూస్) హైదరాబాద్ లోని గోల్కొండ వద్ద మంగళవారం నిర్వహించే 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రదర్శన ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడీ బృందం సోమవారం బయలుదేరారు . వారికి మార్లవాయి సర్పంచ్ కనక ప్రతిభా వెంకటేశ్వరరావు సౌకర్యాలు కల్పించి ఢిల్లీకి పంపించారు.

సందర్భంగా సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు ముద్దాడి బృందాన్ని ఆహ్వానించడం ఎంతో సంతోషకరమని అన్నారు. తరలివెళ్లి వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, గుస్సాడీ బృందం టీం లీడర్ కనక సుదర్శన్, సభ్యులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement