Sunday, May 5, 2024

TS: గురుకుల విద్యార్థిని సూసైడ్​ …సూర్యాపేటలో మరో ఘటన

సూర్యాపేటలో జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్‌ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మోతె మండలం బుర్కచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్‌-జ్యోతి దంపతుల కుమార్తె అస్మిత.. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదవుతోంది.

అయితే, ఈ నెల 10న అదే గురుకుల స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదవుతున్న విద్యార్థిని వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ నేపథ్యంలో పాఠశాలలో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి నాలుగు రోజులపాటు హోం సిక్‌ సెలవులు ఇచ్చారు. దీంతో అస్మిక తన ఇంటికి వచ్చింది. కాగా, రోజువారీ లానే అస్మిక తల్లి జ్యోతి శనివారం ఉదయం కూలి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని కనిపింది. అదే రోజు ఆమె స్కూల్‌కు తిరిగి వెళ్లాల్సి ఉన్నది. దీంతో అస్మిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement