Monday, May 6, 2024

Group-1 Exam.. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. ఆదివారం పెద్దపల్లి జిల్లాలో ఉదయం 8-30 గంటల నుండి 10-15 వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లాలో 16 పరీక్షా కేంద్రాలలో 6067 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పెద్దపల్లి లో 3, రామగుండం లో 10, సుల్తానాబాద్ లో 2, రామగిరి లో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళే సమయంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement