Sunday, May 12, 2024

Breaking | ఆర్టీసీ వీలీనానికి గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్న‌ల్‌.. స‌భ ముందుకు రానున్న బిల్లు

ప్ర‌భుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌ ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారుల‌తో చ‌ర్చించిన మీద‌ట గ‌వ‌ర్న‌ర్ ఎట్ట‌కేల‌కు బిల్ల‌ను ఆమోదించారు. గ‌వ‌ర్న‌ర్ గ్రీన్ సిగ్నల్‌తో టీఎస్‌ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం దిశ‌గా బిల్లును అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ పేర్కొన్నారు. స‌భ ముందుకు ఆర్టీసీ విలీన బిల్లు రానున్న‌ట్టు తెలుస్తోంది.

టీఎస్ఆర్టీసీ విలీన బిల్లును రెండు రోజులుగా గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెట్ట‌డంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు భ‌గ్గుమ‌న్నాయి. సంస్ధ ఉద్యోగులు, కార్మికులు చ‌లో రాజ్‌భ‌వ‌న్‌కు పిలుపు ఇచ్చారు. బ‌స్సుల‌ను బంద్ చేసి నిర‌స‌న తెలిపారు. కార్మికుల ఒత్తిడితో గ‌వ‌ర్న‌ర్ బిల్లుకు ఆమోదం తెలిపిన‌ట్టు తెలుస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement