Thursday, May 2, 2024

TS | అందరికీ వైద్యం, ఆహ్లాదకరమైన వాతావరణమే లక్ష్యం: ఎంపీ రంజిత్‌రెడ్డి

శంకర్‌పల్లి (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ జన్వాడలో ప్రజల సమస్యలన్నీ పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆరోగ్య రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్నిరకాల పరీక్షలు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్య రథంలో ప‌రిష్కారం దొరుకుతుంద‌న్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

సర్పంచ్ లలిత విజ్ఞప్తి మేరకు ఫిరంగి నాలాకు పూర్వపు కళ సంత‌రించుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ పరిధిలో పల్లె దవఖానా ఏర్పాటుకు మంత్రి హరీష్ రావుతో మాట్లాడి ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. గ్రామ పరిధిలో పల్లె దవఖానా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఫిరంగి నాలా పరిసరాలను ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులతో క‌లిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల స్థితిగతులను మార్చి పట్టణాలతో పోటీపడే విధంగా తయారు చేస్తోంద‌ని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement