Wednesday, May 1, 2024

ఎమ్మెల్యే ఈటెల‌పై -ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్

భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ..ఈటెల హుజురాబాద్ లో ఓడిపోతానని భయంతో గజ్వేల్ లో పోటీ చేస్తానని, కరీంనగర్లో పోటీ చేస్తానని, సిద్దిపేటలో పోటీ చేస్తానని మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హుజురాబాద్ ప్రజలు ఉప ఎన్నికలో ఎందుకు గెలిపించామని మదన పడుతున్నారని, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో దోస్తీ కట్టడం వల్లే హుజరాబాద్ లో ఈటెల గెలుపొందారన్నారు. రాజకీయ జీవితం ప్రసాదించిన కేసీఆర్ పట్ల అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటని, మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం నాలుక చీరేస్తారన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలోనే గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని కొనియాడిన ఈటెల బిజెపిలోకి వెళ్ళగానే ప్రభుత్వం పై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. గుజరాతిలకు గుణం గురి చేస్తూ తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement